ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిలో ఎనిమిది మందికి నిబంధనల మేరకే స్టేషన్ బెయిల్ వచ్చిందని తెలిపారు.
ఇందులో ముఖ్యమంత్రిగా తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కేసును దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశామని అన్నారు.
ఏపీ ఎంపీ పుట్టా మహేశ్కు నిబంధనల మేరకు స్టేషన్ బెయిల్ వచ్చిందని తెలిపారు. 2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోవని జోస్యం చెప్పారు. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందుగానే వస్తే సంతోషిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారు.


మాయమాటలతో కేసీఆర్ ఐదేళ్లు పాలన: ఎంపీ కోమటిరెడ్డి