రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
పొత్తు ప్రతిపాదనపై తమ పార్టీ బీహార్ నాయకత్వం ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించిందని, ఇప్పుడు నిర్ణయం వారి చేతుల్లోనే ఉందని ఆయన తెలిపారు.
బీజేపీ, జేడీయూ కూటమిని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒవైసీ, బీహార్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే లౌకికవాదాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రతిపాదన చేశామన్నారు.
మా బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్కు లేఖ రాశారు” అని ఒవైసీ వివరించారు.
తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
పొత్తులో భాగంగా తమకు ఆరు సీట్లు కేటాయించాలని కోరామని, గెలిస్తే మంత్రి పదవులు కాకుండా సీమాంచల్ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తమ కంచుకోట అయిన హైదరాబాద్లో పోటీ చేసేందుకు ఆర్జేడీని ఆహ్వానిస్తున్నట్లు కూడా ఒవైసీ తెలిపారు.