telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మోహన్ బాబు: బుద్ధా వెంకన్న

ycp jagan with malya meeting said budda
సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ప్రచారంలో  మోహన్ బాబు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు.
మోహన్ బాబు జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మారి చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పది రోజులు ఆయన కాల్షీట్లు జగన్‌కు అమ్ముకున్నారని ఆరోపించారు. నట ప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్ బాబు ఊసరవెల్లిలా ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి మాట్లాడతారన్నారు. 
చంద్రబాబుపై బురద చల్లేందుకు మోహన్ బాబుకి ఎంత పారితోషికం అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు.పారితోషికం ఇవ్వందే ఏమీ మాట్లాడరని సినీ పరిశ్రమలో ఆయనకు పేరుందని దుయ్యబట్టారు. గురువు దాసరి నారాయణ రావు కే పంగనామాలు పెట్టిన ఘనుడు మోహన్ బాబు అని విమర్శించారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెంకన్న సవాల్‌ విసిరారు.

Related posts