మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్గా దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు.
దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచుతోంది. కొంచెం కూడా ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. ప్రత్యేక ఇంటర్వ్యూలు, చిట్చాట్లు అంటూ దేశమంతటా తిరుగుతోంది.
ఈ క్రమంలోనే రేపటి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సిద్ధమైంది. 6 రోజుల్లో 9 నగరాలను చుట్టిరావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏ నగరాల్లో, ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ నిర్వహించబోతున్నారలో తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్(మార్చి 18), దుబాయ్(మార్చి 18), బెంగళూరు(మార్చి 19), బరోడా(మార్చి 20), దిల్లీ(మార్చి 20), అమృతసర్(మార్చి 21), జైపుర్(మార్చి 21), కోల్కతా(మార్చి 22), వారాణాసి(మార్చి 22) మళ్లీ తిరిగి హైదరాబాద్లో( మార్చి 23) ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి అభిమానులను ఉత్సాహపరచనున్నారు..
ఈ షెడ్యూల్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా భారీగా ప్లాన్ చేసింది. మార్చి 19న బెంగళూరులోని చిక్కబళ్లాపురలో గ్రాండ్గా నిర్వహించనున్నట్లు తెలిపింది.