గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా జిన్నా టవర్కు జాతీయ జెండాలోని రంగులు వేశారు..
జిన్నా పేరును తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలనే వాదనను బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు.
జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగుర వేయాలని కొంతమంది ప్రయత్నించారు.
దేశ విభజనకు కారణమైన అయితే కార్పోరేషన్ మేయర్, అధికారులు ఆ ప్రతిపాదనను తిప్పి కొట్టారు.
3వ తేదిన జాతీయ జెండా ఎగుర వేస్తామని మేయర్ మనోహర్ చెప్పారు.
దీంతో కార్పోరేషన్ మేయరై మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫా, మరికొంత మంది నేతలు జిన్నా టవర్ కు జాతీయ జెండాలోని రంగులు వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కార్మికులు ఇవాళ జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు.
అదే విధంగా ఈ నెల 3వ తేదిన జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. వివాదానికి పుల్స్టాప్ పేట్టారు.