ఎస్.బి.ఐ మరోసారి వినియోగదారుల కోసం చక్కటి సదుపాయాన్ని అందిస్తుంది. సొంతింటి కలను నిజం చేసుకునే ప్రయత్నంలో అప్పు చేసైనా ఇల్లు కొనాలనుకుంటారు. హోమ్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. మరి ఇలాంటి వారికోసమే ఎస్బీఐ బ్యాంక్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్తో హోమ్ లోన్ ఆఫర్ చేస్తోంది. సాధారణంగా హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజుతో పాటు, టెక్నికల్, లీగల్ చార్జీలు వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. ఇవన్నీ కలిపితే అదనపు భారమే అవుతుంది లోన్ తీసుకునేవారికి.
ఈ భారాన్ని తగ్గించేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్పై ప్రాసెసింగ్ ఫీజుని తొలగించింది. అయితే ఈ అవకాశం ఫిబ్రవరి 28లోపు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. దీంతో పాటు మరో శుభవార్తను కూడా ఎస్బీఐ అందించింది.. అది హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గించినట్లు తెలిపింది.