నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కె ఎమ్మెల్యే రోజా కబడ్డీ కోర్టులో కూత పెట్టారు. నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే రోజా కాసేపు కబడ్డీ ఆడి హల్ చల్ చేశారు.. ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో తన నియోజకవర్గమయిన నగిరి డిగ్రీ కళాశాల మైదానంలో ‘స్టోర్ట్స్ మీట్’ను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు.
ఆ తరువాత టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక చేశారు. ఆనంతరం భర్త సెల్వమణితో కలిసి ‘కబడ్డీ కబడ్డీ ‘ అంటూ కబడ్డీ కోర్టు బరిలోకి దిగి అలరించారు. ఒక్కొక్కరు ఒక్కొటీమ్లో భార్యాభర్తలిద్దరూ విద్యార్థులతో కాసేపు కబడ్డీ ఆడారు. ఈవేళ నుంచి ఈనెల 15 వరకు కబడ్డీ పోటీలు కొనసాగుతాయి.
గతంలోనూ అనేక సార్లు రోజా కబడ్డీ ఆడారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అంతా పాటు పడాలన్నారు. ఖాళీ వున్నప్పుడల్లా కబడ్డీ ఆడాలన్నారు. తనకెంతో ఇష్టమయిన కబడ్డీ ఆడి అలరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వెనక్కి తగ్గిన సీపీఐ నారాయణ : చిరంజీవికి క్షమాపణ