కశ్మీర్లో అడుగుపెట్టిన ఉగ్రవాదులు ప్రాణాలతో తిరిగి వెళ్లరని ఆర్మీ, కశ్మీర్ పోలీసు వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు వెంటనే లొంగిపోవాలని, లేదంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ప్రతీ ఒక్కరిని అంతం చేస్తామని ఆర్మీ అధికారి కన్వాల్ జీత్సింగ్ థిల్లాన్ హెచ్చరించారు. ఈ రోజు ఆయన మేడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ను ఆనవాలు కశ్మీర్ లోయలో కనిపించకుండా చేస్తామని పేర్కొన్నారు.
పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందని స్పష్టమైందని, దీనికి పాక్ సహకారం ఉందని వెల్లడించారు. ఉగ్ర సంస్థలో ఉన్న, చేరాలనుకున్న ఎవరైనా సరే లొంగిపోవాలని విఙ్ఞప్తి చేస్తున్నా. తుపాకీ వదిలేయమని కుటుంబ సభ్యులైనా వారికి సూచిస్తే మంచింది. అలా జరగని పక్షంలో వారిని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.