మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు ఇప్పటికే ఖైదీ 150, సైరా సినిమాలతో మంచి విజయాలను అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈసినిమా తర్వాత మెగాస్టార్ మరో మూడు సినిమాలు చేయబోతున్నారు. వీటిలో మలయాళం లో సూర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ చేసారు. దీనికి తెలుగులో మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఎప్పటినుండో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హల చల్ చేస్తుంది. ఈ సినిమాలో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నయన్ ఈ సినిమాలో దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తుంది. కానీ ఈ సారి మెగాస్టార్కు జోడిగా కాకుండా ఆయనకు గట్టిపోటీ ఇచ్చే సిస్టర్ పాత్ర కోసం అనుకుంటున్నట్లు టాక్. ఒరిజినల్ వైర్షన్ మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకి నయనతార అయితే… ఇంపాక్ట్ చాలా బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. చూడాలి మరి దీని పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది.
previous post
భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినం: మాజీ సీఎం ముఫ్తీ