యంగ్ హీరో శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ కు తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. తాజాగా శ్రీకారం మూవీ టీజర్ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ను ప్రిన్స్ మహేష్ బాబు లాంచ్ చేశారు. రిలీజ్ అయిన కొద్ది సేపటికే ఈ టీజర్ కు మంచి స్పందన కూడా వస్తోంది. ఇక టీజర్ విషయానికి వస్తే.. వ్యవసాయం బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూర్తిగా ఈ మూవీ గ్రామీణ ప్రాంతలోనే తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్లో హీరో శర్వానంద్ గెటప్ అదిరిపోయింది. వినేవాళ్లు మన నెత్తి మీద జట్టంతా ఉంటే.. పండించే వాళ్లు మూతి మీద మీసం అంత లేరని శర్వానంద్ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడు: నాగబాబు