telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చైతూతో గొడవ నిజం కాదు… : చందూ మొండేటి

Naga-Chaitanya

కార్తికేయ’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు చందూ మొండేటి. నాగ చైతన్యతో ఆయన తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత చైతూతో ఆయన ‘సవ్యసాచి’ అనే సినిమా చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమా షూటింగు సమయంలోనే చైతూకి, చందూకి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే టాక్ వచ్చింది. తాజాగా ఈ విషయంపై చందూ స్పందించారు. చందూ మొండేటి మాట్లాడుతూ “నేను .. చైతూ గొడవ పడినట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. నాకున్న మంచి స్నేహితుల్లో చైతూ ఒకరు. త్వరలోనే ఆయనతో ఒక సినిమా ఉంటుంది. ప్రస్తుతం నేను ‘కార్తికేయ 2’ సినిమా పనుల్లో వున్నాను. ఈ సినిమా హిట్ అయితే, చైతూ దగ్గర నుంచి కాల్ వస్తుందనే అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

Related posts