పసిడి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ స్వల్పనగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.324 పెరిగి రూ. 51704 కు పలుకుతోంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగి రూ. 52940 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగి రూ. 48530 కు పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1598 పెరిగి రూ. 62972 కు చేరింది. నిన్న ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 61,374 వద్ద ముగిసింది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ. 61600 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పసిడి ధరలు పెరగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు.
previous post