టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని.. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అన్నారు. అచ్చెన్నాయుడు మహిళలను బూటుకాళ్లతో తంతాడని రోజా ఆరోపించారు. టీడీపీలో ఉన్నంతమంది ఉన్మాదులు దేశంలోనే లేరని రోజా ఆరోపించారు. మహిళ అని చూడకుండా మహిళా ఛైర్పర్సన్పై చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు.దమ్మున్న జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. చంద్రబాబు దొంగలా కరకట్టలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు.
మహిళా నాయకురాళ్లతో జగన్ గురించి, భారతమ్మ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయలేని చంద్రబాబు చీర కావాలో, చుడీదార్ కావాలో నిర్ణయించుకోవాలని రోజా వ్యాఖ్యానించారు..

