telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలోకి మరో బాలీవుడ్ చిత్రం “శకుంతలాదేవి”

Shakunthala-devi

హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి బ‌యోపిక్‌లో విద్యా బాల‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. “శ‌కుంత‌లా దేవి” అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది. అను మీనన్ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రాన్ని లెడ్ అబుందంటియా ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో వికాస్ మల్హోత్రా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని భావించిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్ వ‌ల‌న ఓటీటీలో విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. రీసెంట్‌గా స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన సినిమా ‘లక్ష్మీబాంబ్’ ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అంటూ టాక్ వినబడింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. చూస్తుంటే అన్ని ఇండస్ట్రీలకు ముందు ముందు ఓటీటీనే గతి అయ్యేలా కనబడుతుంది. ఇక ‘శకుంతలా దేవి’ చిత్రం జూలై 31న విడుదల అవుతుంది అని గణిత రూపంలో అమెజాన్ ప్రైమ్ ప్రకటించడం విశేషం.

Related posts