ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లడక్లో ఆకస్మిక పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ సింధు నదీ జలాలకు పూజలు చేశారు. లేహ్లో ఉన్న నిము ఫార్వర్డ్ పోస్టుకు మోదీ వెళ్లారు. ఆ ప్రాంతంలో జాన్స్కర్ పర్వత శ్రేణుల్లో ఉన్నది. అక్కడే సింధూ నది పరివాహక ప్రాంతం కూడా ఉన్నది. సింధు నది ప్రవహిస్తున్న ఓ ప్రాంతం వద్ద ప్రధాని మోదీ నదీమాతకు సింధూ దర్శన పూజలు చేశారు. అనంతరం మోదీ సైనికులను కలుసుకున్నారు.
గాల్వన్ ఘటనతో ఉద్రిక్తంగా మారిన లడఖ్ సైనికుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు మోదీ. సైనికుల మనోధైర్యం హిమాలయ పర్వతాల కన్నా అత్యంత ఎత్తుగా ఉన్నట్లు చెప్పారు. సైనిక దళాలు బలంగా ఉండడం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల భారతీయ బలగాలు ప్రదర్శించిన వీరత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు.
కవిత ఓటమికి కారణాలు వివరించిన కేటీఆర్