telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

fire in plastic factory dhaka 13 died

సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్ అనే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్ధంతో కంపెనీ మొత్తం మంటలు వ్యాపించాయి. రియాక్టర్‌లో పేలుడు సంభవించడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కంపెనీలో కొంత మంది కార్మికులు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భారీ పేలుళ్లతో పరుగులు పెట్టారు కార్మికులు. గాయాలతో కిందపడి కార్మికులు అల్లాడుతున్నారు. గాయాలపాలైన కార్మికులను ఆస్పత్రికి తరలించారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో తీవ్రంగా ఎనిమిది మంది గాయపడ్డారు. వీరి పేర్లు కూడా బయటపెట్టారు పోలీసులు. వెంకటేశ్, రితికేష్ కోమల్, ఇరేష్ రేష్మా, క్రిష్ణ మల్లిక్ , విద్యాభాను సింగ్ , రాజారావు , రాజు , ఆనంద్ పార్థి గుర్తించారు పోలీసులు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది… ఎవరి వల్ల జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. లాక్‌ డౌన్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అగ్ని ప్రమాదాలు వరుసగా చోటు చేసుకోవడం తెలిసిన విషయమే. 

Related posts