ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ యాహూ తన గ్రూప్స్ సేవలను ఇకపై నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆ సేవలను ఇక ఎంతమాత్రం కొనసాగించలేమని స్పష్టం చేసింది. అయితే గ్రూప్స్ను ఇప్పటికే వాడుతున్న యూజర్లు తమ డేటాను డౌన్లోడ్ చేసుకుందుకు యాహూ అవకాశం కల్పించింది. డిసెంబర్ 14వ తేదీ వరకు అందుకు గడువు ఇచ్చింది. యూజర్లు యాహూ గ్రూప్స్లోని ప్రైవసీ డ్యాష్బోర్డ్కు వెళ్లి తమ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చని యాహూ తెలిపింది. అయితే ప్రస్తుతానికి యాహూ గ్రూప్స్లో కంటెంట్ అప్లోడింగ్ను కూడా నిలిపివేశారు.
2001లో ప్రారంభమైన యాహూ గ్రూప్స్ ఒకప్పుడు నెటిజన్లకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే అభిరుచులు కలిగిన ఇంటర్నెట్ వినియోగదారులు తమ భావాలను పంచుకునేందుకు వేదికగా నిలిచింది. ఇక యాహూ గ్రూప్స్ ఇక కనుమరుగు కానుండడంతో పలువురు యూజర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.