అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు తమ పర్యటనలో భాగంగా ఆగ్రా చేరుకున్నారు. యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యానాథ్ లు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ ను ట్రంప్ ఫ్యామిలీ ప్రత్యక్షంగా వీక్షించారు.
యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆ ముగ్ధమనోహర ప్రేమ చిహ్నాన్ని.. ట్రంప్, మెలానీయాలు ఆసక్తిగా తిలకించారు. అహ్మాదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులు.. ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో తాజ్మహల్ చేరుకున్నారు. తొలుత సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలను రాశారు. తాజ్ లాన్లో తిరిగారు. తాజ్ ముందు ఫోటోలకు ఫోజు ఇచ్చారు. గైడ్ వివరించిన సంగతలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.