శ్రీవారి ఆస్తుల విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. టీటీడీ ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు.
వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని జనసేన నేతలు ప్రకటించారు. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. టీమ్ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు.