హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన వెనుక వివరాల్లోకి వెళితే, 23వ తేదీ రాత్రి 11 గంటలకు బస్సును సీబీఎస్ బస్టాప్ లో నిలిపిన డ్రైవర్, ఆపై విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లి, మరుసటి రోజు ఉదయం బస్సును తీసేందుకు వచ్చాడు.
అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ లో బస్సు కనిపించక పోవడంతో ఫిర్యాదు చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే బస్సు చోరీకి గురైందని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు, సీసీ కెమెరా దృశ్యాలన్నీ పరిశీలించి, ఈ బస్సు రాత్రి ఒంటిగంట సమయంలోనే తూప్రాన్ టోల్ గేటును దాటిందని గుర్తించారు. ఆపై ఇది నాందేడ్ వైపు వెళ్లిందని, బస్సు ఎక్కడ ఉందో కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
అన్నయ్య సినిమాలు వరుణ్ రీమేక్ చేస్తే పెద్ద సవాలే..!