టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో “మన్మథుడు-2”, తమిళంలో సూర్య “ఎన్జికె’ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో ఆమె నటించిన “దే దే ప్యార్ దే” చిత్రం మే 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రకుల్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని చాలా మంది కలలు కంటారు. కానీ చాలా తక్కువ మందికి ఆ ఛాన్స్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో నాకు దక్కిన స్థానం చూసుకొని గొప్పగా ఫీల్ అవుతాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు.. సక్సెస్ అందుకోవడానికి మనం చేసే జర్నీలో ఎదురయ్యే ప్రతికూలతను ఎదిరించడం నేర్చుకోవాలి… కష్టపడి పని చేయడమంటే ఇష్టం… వర్క్ ని ఎంతగా ప్రేమిస్తా అంటే ముప్పై గంటలు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయగలను. ఇక సీనియర్ నటులతో పని చేయడం కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుంది. వారిని చూసి స్ఫూర్తి పొందుతుంటాను. “దే దే ప్యార్ దే” సినిమాలో అజయ్ దేవగన్, టబులతో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది ఈ పంజాబీ బ్యూటీ.
అరే లుచ్చా.. లఫంగి ఫెలోస్… వీధిలోకి వెళ్లి మొరగండి… నా ఫేస్ బుక్ స్ట్రీట్ కాదు… మాధవీలత ఫైర్