కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. నరేంద్ర మోదీ అసమర్థత కారణంగా రైతుల జీవితాలు దుర్భరమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు ఏటా 6 వేల ఆర్థిక సాయం అందిస్తామనడం రైతులను అవమానపరచడమే అని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
ఈ మేరకు.. ‘డియర్ నమో.. మీ ఐదేళ్ల అసమర్థ, అహంకారపూరిత పాలన మా రైతుల జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడేమో రోజుకు 17 రూపాయలు ఇస్తామనడం రైతులను, వారి శ్రమను అవమానించడమే’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.