ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ ‘మొహెంజోదారో’ బ్యూటీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ముకుంద చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ స్టేటస్ లిస్ట్లో చేరింది. రీసెంట్గా అల వైకుంఠపురములో చిత్రంతో మంచి హిట్ కొట్టిన పూజా .. ప్రభాస్ సరసన నటిస్తుంది. అయితే క్యూర్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో క్యాన్సర్తో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకి 2.5 లక్షల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సమాజానికి మనకి తోచినంత సాయం చేయడం చాలా ముఖ్యం. మనం చేసే ఈ మంచి పని ఇతరులకి స్పూర్తినిస్తుంది. నేను చేస్తున్న ఈ పని చాలా దూరం వెళుతుందనిన భావిస్తున్నాను అని పూజా చెప్పుకొచ్చారు.
previous post