తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ విధానం ద్వారా నిర్వహించబోయే 10వ తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2019లో నిర్వహించడానికి పరీక్ష ఫీజు షెడ్యూల్ను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది. విద్యార్థులు పదో తరగతి సబ్జెక్ట్కు రూ.100 చొప్పున, ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్కు రూ. 150 చొప్పున మీ సేవ ద్వారా లేదా, సహాయ కో-ఆర్డినేటర్కు చెల్లించాల్సి ఉంటుంది.
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 21 నుంచి మార్చి 1వ తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు రూ. 25 చొప్పున, మార్చి 8 నుంచి 12 వరకు రూ.50 చొప్పున, అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజేంద్రనగర్ కో-ఆర్డినేటర్ ఎం.సుగుణ, సహాయ కో-ఆర్డినేటర్ పి.శ్రీనివాస్గౌడ్లు తెలిపారు.
అవసరమైతే రోడ్డుపై పడుకుంటాను.. బెదిరింపులకు భయపడను: చంద్రబాబు