సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం “ఎన్జీకే”. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. దేశంపై ప్రేమతో దేశంలోని అవినీతికి సూర్య ఎలా చరమగీతం పాడాడన్నదే సినిమా కథ. ఈ ట్రైలర్ లో సాయి పల్లవితో సూర్య ప్రేమ వ్యవహారం, రకుల్ ప్రీత్ సింగ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కన్పించడం ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
తాజాగా మే 31న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదలలో జాప్యం కారణంగా సూర్య అభిమానులు కాస్త నిరాశ చెందారు. తాజా అప్డేట్ తో సూర్య అభిమానులు సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.