telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చెర్నోబిల్ డైరస్ సీరీస్ ను వీక్షించిన నాగచైతన్య

Akkineni

అక్కినేని హీరో నాగచైతన్య ఈ లాక్ డౌన్ సమయంలో ప్రపంచంలో అత్యధికమంది వీక్షించిన చెర్నోబిల్ డైరస్ సీరీస్ ను చూశారట. చాలా ఆసక్తిగా ఉందని, నెక్స్ట్ ఏం జరగబోతోందో అనే క్యూరియాసిటీని కలిగించిందని తెలిపారు. ఈ సీరీస్ తో పాటుగా మనోజ్ భాజ్ పాయి నటించిన ఫ్యామిలీ వెబ్ సీరీస్ ను కూడా చైతూ చూశాడట. ప్రభుత్వం షూటింగ్ లు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో చైతూ తన మూవీ షూటింగ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలలుగా షూటింగ్ లు లేకపోవడంతో సెలెబ్రిటీలు ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. అయితే, హీరోలు ఖాళీగా ఉన్న ఈ మూడు నెలల కాలంలో వివిధ రకాల వెబ్ సీరీస్ లు చూస్తూ ఎంజాయ్ చేశారు. కొంతమంది ఇంటి పనుల్లో నిమగ్నం అయ్యారు.

Related posts