టీఆర్ఎస్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి చేరికతో గజ్వేల్ లో తమ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లో గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..వంటేరు ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. తాము ప్రతాపరెడ్డిని 2009లోనే పార్టీలో చేరాలని కోరామని, కొన్ని కారణాలతో ఆయన చేరలేకపోయారని గుర్తుచేసుకున్నారు.
వంటేరు కలిసి రావడంతో మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ పార్టీ మెజారిటీ పెరుగుతుందని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు తిరుగులేదని, రెండోసారి కూడా గజ్వేల్ ప్రజలు అఖండ మెజార్టీతో కేసీఆర్ ను గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గానికి నిధుల వరద పారుతోందని, ఇక్కడి రైతులు మూడు పంటలు పండించుకునే రోజు రాబోతోందని కేటీఆర్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో 40 నుంచి 50 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయని తెలిపారు. తెలంగాణలో ఆశించినంత వేగంగా అభివృద్ధి పనులు జరగాలంటే, కేంద్రాన్ని శాసించాల్సిన స్థాయికి పార్టీ ఎదగాల్సిన అవసరముందని కేటీఆర్ అన్నారు.
అందుకే బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి: చిదంబరం