బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్, అలియా భట్ కుటుంబాల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. “మణికర్ణిక” సినిమా గురించి అలియా భట్ మాట్లాడకపోవడాన్ని తప్పుపడుతూ కంగన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాటికి అలియా సింపుల్ గా, తెలివిగా తనదైన శైలిలో సమాధానం చెప్పింది. దాంతో అలియాపై కంగన మరింతగా ఫైర్ అవ్వడంతో ఈ గొడవల్లోకి వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి చేరారు. ముఖ్యంగా కంగన సోదరి రంగోలీ అలియాపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతోంది. ఈ ట్వీట్లపై స్పందించిన అలియా తల్లి సోనీ రజ్దాన్ కంగనకు తన భర్త మహేష్ భట్ సినిమా ద్వారానే తొలి అవకాశం వచ్చిందని గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు రంగోలి మరింత ఘాటుగా స్పందిస్తూ “డియర్ సోనీజీ.. మహేష్ భట్కు అసలు నిర్మాణ సంస్థే లేదు. కంగనకు తొలి అవకాశం ఇచ్చింది మహేష్ భట్ కాదు.. అనురాగ్ బసు. “వో లమ్హే” తర్వాత కంగనతో “ధోకా” అనే సినిమా తీయాలని మహేష్ అనుకున్నారు. ఆ సినిమాలో నటించడానికి కంగన అంగీకరించకపోవడంతో ఆమెపై మహేష్ కోపం పెంచుకున్నారు. నోటికి వచ్చినట్టు తిట్టేవారు. “వో లమ్హే” ప్రీమియర్ షోకు వెళ్లినపుడు కంగనపై మహేష్ భట్ చెప్పులు కూడా విసిరారు. ఆ రోజు రాత్రంతా కంగన ఏడుస్తూనే ఉంది” అని రంగోలీ ట్వీట్ చేసింది.
previous post