2013 లో వచ్చిన ‘కామసూత్ర 3డి’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయంపై కామసూత్ర దర్శకుడు రూపేష్ పాల్ విచారం వ్యక్తం చేశారు. సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల సైరా ఖాన్ కి ‘కామసూత్ర 3డి’ చిత్రం సైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఆమెలా ఎవరూ నటించి ఉండేవారు కాదని, అలాంటి బోల్డ్ ఫిలిం తో బాలీవుడ్ లో అడుగుపెట్టడం ఆమెకి సవాల్ గా మారిందని, కొన్ని నెలల తరువాత ఆమె ప్రయత్నం ఫలించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే ఆమె మరణ వార్త గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాకపోవడంపై రూపేష్ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్బుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెని ఎవరూ గుర్తించకపోవడం బాధాకరమని, ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.
రజినీకాంత్ ఆరోగ్యంపై కమల్ హాసన్ కామెంట్స్