తెలుగులో సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన “ప్రస్థానం” చిత్రం టాలీవుడ్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్, జాకీ ష్రఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు.. మనీషా కొయిరాలా, చంకీ పాండే, అమైరా దస్తుర్, అలీ ఫజల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దేవా కట్టానే హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ ప్రొడక్షన్స్, ఎన్హెచ్ స్టూడియోస్ బ్యానర్లపై మానయత దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ అంచనాలు పెంచేసింది. అయితే సోమవారం సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ని విడుదల చేశారు చిత్రబృందం. తెలుగులో సాయి కుమార్ చేసిన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. అయితే టీజర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
previous post
రాహుల్ అలా చేసి ఉండకూడదు… పబ్ దాడిపై యాంకర్ వ్యాఖ్యలు