ఐపీఎల్ ఫీవర్ బాగానే కనపడుతుంది. దీనికితోడు వారాంతపు సెలవులు. ఇంకేముంది అందరూ క్రీడాప్రాంగణాలలోనే.. టిక్కెట్ల కోసం పోటీపడుతున్నారు. ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంచినా క్షణాలలో అయిపోతుండటం విశేషం. పైగా నేడు వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్నాయి. సాయంత్రం 4గంటలకు ఒక మ్యాచ్, అలాగే రాత్రి 8గంటలకు రెండో మ్యాచ్ జరుగనున్నాయి.
నేడు సాయంత్రం 4గంటలకు కోల్ కతాతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగనుంది. రాత్రి 8గంటలకు ముంబైతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం జరుగనుంది.