ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఉందని బీసీసీఐ తాజా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. బుధవారం బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లితో రేపు తొలి సమావేశం కానున్నట్లు తెలిపారు. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలను సాధించిందన్నారు.
అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయలనేది కోహ్లి తాపత్రయం. అతడికి అన్ని విధాలం అండగా ఉంటాం. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం. టీమిండియా విన్నింగ్ టీం. మీరు అడగొచ్చు టీమిండియా ప్రపంచకప్ గెలవలేదు కదా విన్నింగ్ టీమ్ ఎలా అవుతుందని.. కానీ ప్రతీసారి ప్రపంచకప్ గెలవలేము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.