మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రాన్ని బాలయ్యతో చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ హక్కులను ఈ సంస్థ తీసుకుంది. అయ్యప్పనుమ్ నాయర్ అనే పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ హవాల్దార్ కోషి కురియన్ మధ్య నడిచే ఈగో వార్కి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. పోలీస్ అధికారిగా బిజు మీనన్, రిటైర్డ్ హవాల్దార్గా పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. బిజు మీనన్ పాత్రను బాలయ్యతో చేయించాలని ఆయనకు సినిమా చూపించగా బాలయ్య ఆసక్తి కనబర్చినట్లు సమాచారం. అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్ కోసం రానాను సంప్రందించారని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
next post