telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజెన్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మి

Rashmi-Gautham

తనను అనవసరంగా టార్గెట్ చేసినందుకుగాను ముగ్గురు నెటిజన్స్‌ను ఓ ఆట ఆడుకుంది యాంకర్‌ రష్మి గౌతమ్. అసలేం జరిగిందంటే.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ గురించి రష్మి ఓ ట్వీట్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ కరోనా ముఖ్యం కాదన్నట్టు రష్మి హోస్ట్ చేస్తున్న ‘జబర్దస్త్’ షో లో ఆమె డ్రెస్సింగ్, డ్యాన్సింగ్ గురించి కామెంట్ చేశారు. దీనికి రష్మి.. ‘మా షో చూడమని మేమేం బలవంతంగా మీ కాళ్లూ, చేతులూ కట్టేసి టీవీ ముందు కూర్చోబెట్టడం లేదు. మేమేం చేసినా షో డిమాండ్ మేరకే. నా డ్యాన్స్ నచ్చకపోతే కళ్లు మూసుకోవచ్చు లేదా ఛానెల్ మార్చుకోవచ్చు ఈ షో తో ప్రాబ్లమ్ అయితే చూడకుండా ఉండొచ్చు కదా.. ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి.. మీరేదైనా సినిమా తీస్తుంటే నాకు సతీ సావిత్రి క్యారెక్టర్ ఇవ్వండి నేను చేసే పని గురించి నన్ను క్వశ్చన్ చేయకండి’ అంటూ కాస్త కోపంగా రియాక్ట్ అయింది. ఓ వ్యక్తి రష్మి ఫోటోలు పోస్ట్ చేస్తూ ‘కామెంట్ చేసే ముందు ఆలోచించండి’ అంటూ కామెంట్ చేయగా.. అతడి ఖాతాలో అసభ్యంగా ఉన్న ఇలియానా ఫోటోను చూపిస్తూ.. ‘ఇప్పుడు నీ ఫ్యామిలీ వాల్యూస్ షాపింగ్ వెళ్లాయా  సొంత గుర్తింపు లేకుండా విదేశీయుడి ఫోటో పెట్టుకుని (అతని ప్రొఫైల్ పిక్‌ని ఉద్దేశిస్తూ) నువ్వు భారతీయ విలువలు, సాంప్రదాయాల గురించి మాట్లాడడమేంటి’ అని అసహనం వ్యక్తం చేసింది. దానికి అతను ‘విదేశీయుడి ఫేస్‌తో నీకు సంబంధం ఏంటి?’ అని అడగ్గా.. ‘మరి టీవీ షోకి, కరోనాకు సంబంధం ఏంటి?’ అంటూ అతగాడు మారు మాట్లాడకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రష్మి.

Related posts