గాల్వన్ ఘటన తో చైనాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా మొబైల్స్, ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. వెంటనే వారు తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సాక్షి అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా ఉత్పత్తుల ప్రకటనల్లో నటించనని తేల్చి చెప్పింది. అంతేకాకుండా చైనా ఉత్పత్తులను కూడా వాడనని ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవాలని చూస్తోందన్న సాక్షి అగర్వాల్.. శాంతికి, సహనానికి భారతదేశం చిరునామా అని పేర్కొంది. భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకే మన సైన్యంపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షి అగర్వాల్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. చైనా బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అమితాబచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని కోరుతున్నారు. దేశంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. చైనా ఆప్ లను కూడా మొబైల్స్ నుండి డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
previous post
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు