మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అన్నారు. తాను తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని తెలిపారు. అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు.
వేలకోట్ల బ్యాంక్ రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నిన్న లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్కు విచారణ కోసం హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బులు వెనక్కి తీసుకోవాలంటూ భారత్లోని బ్యాంకులకు మొరపెట్టుకున్నాడు. తనకు ఇచ్చిన అసలులో వందకు వంద శాతాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకులను కోరాడు. ఈ విషయంలో చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నాడు.
వెయ్యి కోట్లు ఇచ్చినా.. అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వదు: జగ్గారెడ్డి