telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : కెప్టెన్ మారిన… మారని హైదరాబాద్ రాత

ఐపీఎల్ లో డబుల్ హెడర్ సందర్బంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో కెప్టెన్ సంజు(48) తో రాణించగా ఓపెనట్ బట్లర్(124) సెంచరీ పూర్తి చేసాడు. దాంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది రాయల్స్. ఇక తర్వాత 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (31), మనీష్ పాండే(30) మంచి ఆరంభాని ఆంచిందినా ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ తో సహా అందరూ ఆటగాళ్లు నిరాశపరచడంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది. దాంతో రాజస్థాన్ 55 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. కానీ హైదరాబాద్ ఆరో ఓటమితో అఖ్రి స్థానంలోనే ఉంది. ఇక ఈ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ కు 7 మ్యాచ్ లు ఉండగా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే వాటానింటిలోను గెలవాలి. లేదంటే కష్టమే.

Related posts