ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మరోసారి నిలిచారు.
అమెరికాకు చెందిన ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో ఆయన 68 శాతం అప్రూవల్ రేటింగ్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
మార్చి 2 నుంచి 8వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను బీజేపీ నేతలు స్వాగతిస్తూ, ప్రధానిపై ప్రశంసలు కురిపించారు.
ఈ ఘనత సాధించినందుకు ప్రధాని మోదీకి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు.

