telugu navyamedia
ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

మెగా డీఎస్సీ పరీక్షల నిర్వాహణ పై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

మెగా డీఎస్సీ ద్వారా ఏపీ ప్రభుత్వం 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది.

జూన్ 6 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే, ప్రిప‌రేష‌న్‌ కు 90 రోజుల గడువు ఇవ్వాలని చాలా మంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

డీఎస్సీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ఈ డిమాండ్‌ పై ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

“డీఎస్సీ ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కొందరు సమయం పెంచాలంటున్నారు.

గతేడాది డిసెంబర్లోనే మేము సిలబస్ ప్రకటించడం జరిగింది. ఏకంగా ఏడు నెలలు గడువిచ్చాం” అని ఆయన గుర్తు చేశారు.

దీంతో మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో మెగా డీఎస్సీ గడువు పెంపునకు అవకాశం లేదని క్లారిటీ ఇచ్చటినట్లైంది.

Related posts