telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు సిట్‌ విచారణ కొనసాగుతోంది.

ఉదయం హరీశ్‌రావు వెంట న్యాయవాదులను పీఎస్‌ లోపలికి పోలీసులు అనుమతించలేదు.

జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో హరీశ్‌రావును సిట్‌ అధికారులు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌ రెడ్డి విచారిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు సోమవారం సిట్‌ నోటీసులు చేసారు. ఆయన జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్‌ సిబ్బంది నోటీసులను కోకాపేటలోని ఆయన ఇంట్లో ఇచ్చి వెళ్లారు.

మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో హరీశ్‌రావు విచారణ కొనసాగుతుండగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణుల నినాదాలు చేసారు.

నిరసనకారులను జూబ్లీహిల్స్ పీఎస్‌ నుంచి పోలీసులు పంపించారు.

Related posts