సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్, సూపర్స్టార్తో కలిసి దిగిన సెల్ఫీని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. కార్యక్రమానికి హాజరైనందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశాడు. “సెల్ఫీ నెం.1 ఇది. `సరిలేరు నీకెవ్వరు` ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇక, డియర్ మహేష్.. నా మీద మీరు ఉంచిన నమ్మకానికి, అభిమానానికి ధన్యవాదాలు” అంటూ దేవి పేర్కొన్నాడు.
Here we go..
Selfie No:1..ThankU Dearest #MEGASTAR Chiru Sir 4 gracing our #SarileruNeekevvaruPreRelease Event 🙏🏻❤️
&
ThankU Dearest Super⭐️ @urstrulyMahesh sir 4 d Trust , Love & all d Lovely words🙏🏻❤️
&
ThankU each & every1 for makin it a grand Success last night🙏🏻🎶🎵❤️ pic.twitter.com/bHz2FalAPS
— DEVI SRI PRASAD (@ThisIsDSP) January 6, 2020

