రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది.
ఈ మేరకు ఈరోజు (గురువారం) జీఎడీ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన గెజిట్ నోటిఫికేషన్ను సర్కార్ తిరిగి ప్రచురించింది.
2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభంకానుంది. అదేరోజు ఏపీ వ్యాప్తంగా కూడా జనగణన ప్రక్రియ మొదలుకానుంది.

