ఇది పేదల ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టామని తెలిపారు. గత పాలకులు ఇళ్ల పేరుతో దోచుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,3,989 ఇళ్లకు గృహప్రవేశాలు చేశామన్నారు. నెల్లూరులో పసుపు కుంకుమ కింద రూ.వెయ్యి కోట్లు ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.
విభజన గాయం మానకముందే కారం చల్లేందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి కష్టపడుతున్నామని, రూ. 200 పెన్షన్లను రూ. 2 వేలకు పెంచామని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీ కంటే అద్భుతంగా ఇళ్లను నిర్మించామని తెలిపారు.