వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. ఇంక ఒక్కవారం ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇప్పటికే రాహుల్ ఫైనల్కు వెళ్లిపోయాడు. ఇక వరుణ్ సందేశ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిల్లో నలుగురు ఫైనల్కు చేరుతారు. ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ సీజన్ 3ఎపిసోడ్ 96లో ఇంటి సభ్యులకి హౌ క్లీన్ యువర్ జర్నీ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఒక్కో హౌజ్మేట్ తాము ఫైనల్కి ఎందుకు అర్హులు, అవతలి వారు ఎందుకు కాదో వివరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు అందరికి తెల్ల బట్టలతో పాటు రంగు నీళ్ళ బౌల్ కూడా ఇచ్చారు. తమకి ఎవరు అనర్హులు అనిపిస్తే వారిపై రంగు నీళ్ళు చల్సాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా బాబా భాస్కర్.. అలీలు ముందుకు వచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు కొన్ని సార్లు దురుసుగా మాట్లాడిన క్రమంలో నీపై నీళ్ళు చల్లుతున్నాను అని అలీపై రంగు నీళ్ళు చల్లారు బాబా. ఆ తర్వాత శివజ్యోతి, శ్రీముఖిలు ముందుకు వచ్చారు. అందరిలో నువ్వు చాలా ఎమోషనల్. ఇదే నీలో అతి పెద్ద మైనస్. అందుకే నువ్ ఫైనల్ కంటెస్టెంట్ అయ్యేందుకు అర్హత లేదనిపిస్తోంది అని శివజ్యోతిపై రంగు చల్లింది శ్రీముఖి. అనంతరం వరుణ్, శివజ్యోతి ముందుకు రాగా.. వరుణ్పై రంగు నీళ్ళు చల్లింది శివజ్యోతి.
అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎప్పుడు చెప్పే నువ్వు నాతో చాలా దురుసుగా ప్రవర్తించావు, కంత్రి అన్నావు. నా ఇంటి పేరు ఏంటి అని నన్ను కామెడీ చేసి హేళన చేశావు. నా విషయంలో ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనిపించలేదు. ఇందుకే నువ్వు ఫైనల్కి వెళ్ళే అర్హత లేదనిపిస్తుంది అని వరుణ్ గురించి వివరించింది శివజ్యోతి. ఇక చివరిగా శ్రీముఖిపై అలీ నీళ్ళు చల్లాల్సి ఉండగా, వరుణ్ సందేశ్ .. బాబా భాస్కర్పై రంగునీళ్ళు పోయాలి. బాబా భాస్కర్తో తనకి ఎలాంటి కంప్లైంట్ లేదని, అందుకోసం అతనిపై రంగు నీళ్ళు పోయనని వరుణ్ చెప్పాడు. అలానే అలీ కూడా శ్రీముఖిపై రంగు నీళ్ళు పోయనని అన్నాడు. అందుకు కారణం శ్రీముఖికి టాప్ 5లో ఉండే అర్హత తప్పక ఉందని పేర్కొన్నాడు. కాని చివరికి ఒకరు మాత్రమే గేమ్లో గెలవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో ఇష్టం లేకుండానే వరుణ్.. బాబా భాస్కర్పై రంగు నీళ్లు చల్లారు. దీంతో ఈ ప్రక్రియలో శ్రీముఖి మిస్టర్ క్లీన్గా నిలిచి ప్రేక్షకుల్ని ఓట్లు అడిగే అవకాశాన్ని అందుకుంది.
కొద్ది సేపటి తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకి డార్క్ సీక్రెట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎవరైన జీవితంలో మచ్చ ఉంటే దానిని తుడిపేసుకొని ఇంటి నుండి హ్యాపీగా బయటకి వెళ్లొచ్చు అని చెప్పారు. జీవితంలో ఒంటిరిగా ఫీల్ అయి బాధ పడిన సందర్భాలను కూడా షేర్ చేసుకోవాలని ఇంటి సభ్యులకు సూచించారు బిగ్ బాస్. దీంతో వరుణ్ సందేశ్ తన గర్ల్ ఫ్రెండ్తో గోవా వెళ్లినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి వివరించాడు. ఆ తర్వాత శివజ్యోతి తన తండ్రి మరణించిన సమయంలో పడిన బాధ గురించి వివరించింది. ఇక శ్రీముఖి.. అందరి అమ్మాయిల మాదిరే నా జీవితంలో ఓ ప్రేమకథ ఉంది అని మొదలు పెట్టింది. తన రిలేషన్ గురించి ఎప్పుడు ఎక్కడా ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాను. నేను ఆ వ్యక్తి గురించి చెప్పకపోవడానికి కారణం అతను అందరికి తెలిసిన వ్యక్తి కావడమే. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో అతనితో రిలేషన్, నా కెరీర్ సాఫీగా సాగింది. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చేసింది. ఆ సమయంలో చచ్చిపోదామనే సిచ్చుయేషన్కి కూడా వెళ్లా అని స్పష్టం చేసింది. స్టేజ్పై ఉన్న సమయంలో అతని గురించి తెలిసి చాలా ఏడ్చాను. మంచిగా సంపాదించి పేరు ప్రఖ్యాతలు పొందిన తర్వాతనే ఏదైన చేయాలి. సెటిల్ కాకుండా లవ్వు గివ్వు అంటూ తిరిగితే ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. శ్రీముఖి చెప్పిన స్టోరీలో అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని శివజ్యోతి, వరుణ్ ఉత్సాహం చూపించినప్పటికి ఆమె చెప్పకపోవడం గమనర్హం.