స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” భారీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేయనున్నాడు. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్, స్టైలిష్ బిజినెస్మెన్గా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. బన్నీకి జంటగా రష్మికా మందన్నా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. గతకొద్ది రోజులుగా ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఉదయం 9 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను రివీల్ను చేయనున్నట్టు తెలిపారు. అయితే దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో.. ఆయన పెట్టే టైటిల్స్ కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. టైటిల్తోనే ఆసక్తి రేకెత్తిస్తారు. ఈ సినిమాకు కూడా సుకుమార్ ఓ ఆసక్తికర టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. శేషాచలం అడవుల బ్యాక్డ్రాప్లో స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు `పుష్ప` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప అట. హీరోయిన్ పేరునే సినిమా టైటిల్గా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
previous post