telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

”హే.. ఇది నేనేనా” అంటున్న సాయిధరమ్ తేజ్

SBSB

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి (SVCC) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట ”హే.. ఇది నేనేనా” విడుదల చేశారు. ”అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృత‌ని చూసాక ఏమైంది ???” అనే కాన్సెప్ట్‌తో సాగిపోతున్న ఈ సాంగ్, థమన్ అందించిన బీట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు రఘరాం అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. థమన్ బాణీలు మ్యూజిక్ ప్రియులకు కొత్త ఫీల్ తీసుకొచ్చాయి. ఈ సాంగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. ”అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట…ఈ పాట..” అని పేర్కొన్నారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts