రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఈ చిత్రం గతేడాది విడుదలై భారీ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 200 కోట్లను వసూలు చేయగా, తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాజ్ తరుణ్ కథానాయకుడిగా సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చింది. ఆ తరువాత కరోనా .. లాక్ డౌన్ ప్రభావం చిత్రపరిశ్రమపై కూడా పడింది. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందులవలన సురేశ్ బాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పందిస్తూ .. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాకి రీమేక్ వుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు’ అని చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా రాజ్ తరుణ్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. దాంతో ఆయన ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
previous post
next post
నటనను విమర్శిస్తే ఓకే… కానీ తక్కువ చేసి మాట్లాడారు… తమిళ “అర్జున్ రెడ్డి” కామెంట్స్