యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం “తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్”. “కేసులు ఇవ్వండి ప్లీజ్” ట్యాగ్ లైన్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రంలో సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్నితెరకెక్కించారు. లాఫింగ్ రైడర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, వరలక్ష్మి శరత్కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఫన్నీ సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. నవంబర్ 15న విడుదల కానున్న చిత్ర ట్రైలర్పై మీరు ఓ లుక్కేయండి.
previous post