ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్మీ నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానని చెబుతున్న జగన్ మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తన ఇంటి కిటికీల కోసం రూ.73 లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పొందడం ఎంత మోసం! అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
“సరిగా వినండి, నేను మళ్లీ ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. జగన్ నివాసంలో కిటికీల ఏర్పాటుకు రూ.73 లక్షలు కేటాయించారు. అన్ బిలీవబుల్, మైండ్ పోతోంది…” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన ట్వీట్ లో దీనికి సంబంధించిన ఆదేశాల ప్రతిని కూడా పొందుపరిచారు.