స్మార్ట్ మొబైల్ యుగంలో స్మార్ట్ వాచ్ లకు కూడా బాగానే గిరాకీ ఉంటుంది. దీనితో అన్ని ప్రముఖ సంస్థల నుండి కొత్తకొత్త మొబైల్ లాగానే స్మార్ట్ వాచ్ లు కూడా విడుదల అవుతూనే ఉన్నాయి. తాజాగా, లెనోవో కంపెనీ ఇగో పేరిట ఓ నూతన స్మార్ట్వాచ్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1,999 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు లభిస్తున్నది.
ఇందులో 1.6 ఇంచ్ డిస్ప్లే, బ్లూటూత్ 4.0, యాక్టివిటీ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, స్విమ్ ట్రాకింగ్, రియల్ టైం హార్ట్ రేట్ మానిటరింగ్, రిమోట్ కెమెరా, వైబ్రేషన్ అలారం, వాటర్ రెసిస్టెన్స్, 20 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఫ్లిప్కార్ట్, క్రోమా స్టోర్స్లో ఈ వాచ్ వినియోగదారులకు లభిస్తున్నది.